అత్తగారి ఇంటికి వెళ్లిన యువకుడు అదృశ్యం

యువకుడు అదృశ్యమైన సంఘటన సింగారెడ్డిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2024-10-15 13:43 GMT

దిశ,పెన్ పహాడ్ : యువకుడు అదృశ్యమైన సంఘటన సింగారెడ్డిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై పేరిక రవీందర్ తెలిపిన వివరాలు ప్రకారం..పచ్చిపాల లింగరాజు ఈనెల 13న మధ్యాహ్నం సమయంలో తన అత్త గారి గ్రామమైన తిమ్మాపురం వెళ్తున్నాడు. ఈ క్రమంలో అదృశ్యమైనట్లు ..యువకుని తండ్రి పచ్చిపాల మల్లయ్య ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News