సండే ఎఫెక్ట్.. యాదాద్రిలో భారీగా భక్తుల సందడి

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది.

Update: 2024-09-29 08:00 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. స్వామి వారి ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. ఆలయంలో మొక్కు కళ్యాణం ఆర్జిత పూజల్లో భక్తులు పాల్గొని మొక్కలు చెల్లించుకుంటున్నారు.


Similar News