చదువుతో పాటు క్రీడలను అలవాటు చేసుకోవాలి

చదువుతో పాటు క్రీడలను అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు.

Update: 2024-09-26 16:19 GMT

దిశ, చింతపల్లి (దేవరకొండ) : చదువుతో పాటు క్రీడలను అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. కుర్మెడు గ్రామ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన 68వ ఎస్జీఎఫ్ దేవరకొండ డివిజన్ స్థాయి క్రీడల పోటీలలో కొండ భీమనపల్లి మహాత్మాజ్యోతి బాపూలే పాఠశాల విద్యార్థులు ఖో ఖో అండర్ 17, 14 విభాగాల్లో మొదటి బహుమతి గెలుసుకున్నారు. ఈ బహుమతుల ప్రదానం కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ను పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు శాలువాతో సత్కరించారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు. దేవరకొండ క్రీడల అభివృద్ధి కోసం చర్యలు చేపడతామని వెల్లడించారు. మండలాల్లో మినీ స్టేడియాల నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖాదర్ మెమోరియల్ స్కూల్, ప్రిన్సిపాల్ ఎం. సాగర్, ఏటీపీ గణేష్, పీడీ నాగేంద్రబాబు పీఈటీ ఆర్. రమేష్, కోచ్ పృథ్వి, విద్యార్థులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News