ఏసీబీ వలలో ఎస్సై.. ఎంత లంచం తీసుకున్నాడో తెలుసా
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం ఎస్సై అంతిరెడ్డి ఓ వ్యక్తి నుండి 10 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టు పడ్డారు.

దిశ, హుజూర్ నగర/ చింతలపాలెం : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం ఎస్సై అంతిరెడ్డి ఓ వ్యక్తి నుండి 10 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాకు చెందిన వర్ల వెంకట్రావు గతంలో చింతలపాలెం మండలంలో పీడీఎస్ బియ్యం కొనుగోలు చేస్తూ గతంలో పట్టుబడ్డాడు. అయితే కేసు ఫైనల్ కు రావడంతో ఆ కేసును కొట్టి వేయాలంటే ఎస్సై 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వెంకట్రావు 10 వేలు ఒప్పుకొని నల్లగొండ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్ సమీపంలోని చర్చి దగ్గర 10 వేలు నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్య డెంట్ గా పట్టుకున్నారు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.