నామమాత్రంగా పంచాయతీ కార్యదర్శులపై విచారణ

చండూరు గ్రామ పంచాయతీకి సంబందించిన రికార్డులు మాయమైన ఘటనపై..స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన విచారణ నామమాత్రంగా జరిగింది .

Update: 2024-10-16 12:26 GMT

దిశ,చండూరు : చండూరు గ్రామ పంచాయతీకి సంబందించిన రికార్డులు మాయమైన ఘటనపై..స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన విచారణ నామమాత్రంగా జరిగింది . ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను పూర్తి ఆధారాలతో విచారణకు హాజరు కావాలని డివిజనల్ పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు ఆదేశించగా.. అనారోగ్యంతో ఒకరు విచారణ రాలేదు. మిగతా ఇద్దరు ఎలాంటి రికార్డు లు లేకుండానే విచారణకు హాజరైన్నారు. దీనిపై డిఎల్ పిఓ కార్యదర్శులను ప్రశ్నినించగా.. తమకు ముందు పనిచేసిన కార్యదర్శులు తమకు కేవలం బీరువా తాళం చెవి మాత్రమే ఇచ్చారన్నారు. ఎలాంటి రికార్దులు ఇవ్వలేదని చెప్పటంతో అధికారులు విస్తూపోయారు. కార్యదర్శులు లిఖిత పూర్వకంగా ఇచ్చిన వివరాలతో జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.


Similar News