హైదరాబాద్ కు బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సుప్రీం కోర్టులో బెయిల్ పొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొద్ది సేపటి క్రితమే హైదరాబాద్ కు బయలుదేరారు.

Update: 2024-08-28 09:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో సుప్రీం కోర్టులో బెయిల్ పొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొద్ది సేపటి క్రితమే హైదరాబాద్ కు బయలుదేరారు. భర్త అనిల్, కుమారుడు, సోదరుడు కేటీఆర్, పలువురు కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలతో కలసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున సన్నహకాలు చేశారు. కాగా ఢిల్లీ ఎయిర్ పోర్టు నుండి బయల్దేరుతుండగా.. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని మీడియాతో అన్నారు. న్యాయం కోసం మా పోరాటం ఎప్పుడూ కొనసాగుతుందని అన్నారు.    


Similar News