ముగిసిన ముఖాముఖి.. 320 అర్జీలను స్వీకరించిన మంత్రి ఉత్తమ్

గాంధీ భవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం ముగిసింది.

Update: 2024-09-27 10:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: గాంధీ భవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్(Congress) కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా దాదాపు 320 అర్జీలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించారు. భూ సమస్యలు, 317 జీఓ బాధితులు, మల్లన సాగర్ ముంపు బాధితులు, సహారా, DKZ టెక్నాలజీ కంపెనీల బాధితులు, పెన్షన్, రేషన్ కార్డ్స్‌లు ఇలా పలు సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలు వచ్చాయి. కాగా, గాంధీ భవన్‌లో ప్రతి బుధ, శుక్రవారాల్లో కొనసాగనున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని గత బుధవారం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రారంభించిన విషయం తెలిసిందే.


Similar News