కారు ఢీ ఒకరి పరిస్థితి విషమం..

జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు ఢీ కొట్టి ద్విచక్ర వాహనదారునికి జరిగిన ఘటన శనివారం బెజ్జంకి క్రాస్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది.

Update: 2024-09-29 17:09 GMT

దిశ, బెజ్జంకి : జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు ఢీ కొట్టి ద్విచక్ర వాహనదారునికి జరిగిన ఘటన శనివారం బెజ్జంకి క్రాస్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారి పై సిద్దిపేట వైపు నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఓ కారు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.

దీంతో వాహనాన్ని నడుపుతున్న బెజ్జంకి మండలం గుండారం గ్రామానికి చెందిన కొంపల్లి నరసయ్య (50) తీవ్ర గాయాలపాలవ్వడంతో చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారని, నరసయ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ పై కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జే.కృష్ణారెడ్డి తెలిపారు.


Similar News