గ్రీవెన్స్లో వచ్చిన ప్రతి ధరఖాస్తును పరిష్కరించాలి : కలెక్టర్ వల్లూరు క్రాంతి
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి గ్రీవెన్స్ లో ఇచ్చిన ప్రతి

దిశ, సంగారెడ్డి : జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి గ్రీవెన్స్ లో ఇచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి 69 దరఖాస్తుదారులు తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ ప్రతి అర్జీ పై తక్షణ చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అలాగే, ప్రజల ప్రధాన సమస్యలపై పూర్తి దృష్టి పెట్టి, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. గ్రీవెన్స్ లో రెవెన్యూ శాఖకు 25 , పౌరసరఫరాల శాఖకు 2, సర్వే ల్యాండ్ 3, పంచాయతీ & పి టి విభాగం 7, పంచాయతీరాజ్ 4, డీఆర్.డీఓ 3, మున్సిపల్ 10, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 5, విద్యాశాఖ 2, వ్యవసాయ శాఖ 3, పశు వైద్య శాఖ 2, వైద్య & ఆరోగ్యశాఖ 3 ధరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి,డీఆర్ఓ పద్మజ రాణి, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, ఆర్డీవో లు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.