తృటిలో తప్పిన ప్రమాదం.. గ్రామం మధ్యలో పిడుగు పాటు..

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని దేగుల్ వాడి గ్రామం మధ్యలో ఉన్న బోలె బాబా దర్గా వద్ద ఆదివారం సాయంత్రం పిడుగు పడింది.

Update: 2024-09-29 16:51 GMT

దిశ, కంగ్టి : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని దేగుల్ వాడి గ్రామం మధ్యలో ఉన్న బోలె బాబా దర్గా వద్ద ఆదివారం సాయంత్రం పిడుగు పడింది. దీంతో దర్గా పై ఉన్న జెండా కర్ర పూర్తిగా దెబ్బతింది. నిత్యం గ్రామస్థులతో రద్దీగా ఉండే ప్రదేశం అయినప్పటికీ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా ఈదురుగాలులు, పిడుగులతో వర్షం బీభత్సం సృష్టించింది. మండల వ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ప్రమాదం అనంతరం దర్గాను పరిశీలించిన గ్రామస్థులు మరమ్మతుల విషయంలో ఏం చేయాలనే దాని పై చర్చిస్తున్నారు.


Similar News