BREAKING: సెకండ్ టైమ్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి

మోడీ 3.0 కేబినెట్‌లో మరోసారి చోటు దక్కించుకున్న తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.. రెండోసారి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Update: 2024-06-09 14:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: మోడీ 3.0 కేబినెట్‌లో మరోసారి చోటు దక్కించుకున్న తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.. రెండోసారి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కిషన్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కిషన్ రెడ్డి హిందీలో కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. మోడీ కేబినెట్ 2.0లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కిషన్ రెడ్డికి.. ఈ కేబినెట్‌లో ఏ ఫోర్ట్ ఫోలియో దక్కుతుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

Tags:    

Similar News