కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు..రావులపల్లి రాంప్రసాద్

కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మూడు రంగుల జండా కలర్లు వేసి తమ ప్రభుత్వంలో ఇచ్చాము, మేము కట్టాం అని కాంగ్రెస్ ప్రభుత్వం చంకలు గుద్దు కోవడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రామ్ ప్రసాద్ ఎద్దేవా చేశారు.

Update: 2025-03-24 08:11 GMT
కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు..రావులపల్లి రాంప్రసాద్
  • whatsapp icon

దిశ, భద్రాచలం : కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మూడు రంగుల జండా కలర్లు వేసి తమ ప్రభుత్వంలో ఇచ్చాము, మేము కట్టాం అని కాంగ్రెస్ ప్రభుత్వం చంకలు గుద్దు కోవడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రామ్ ప్రసాద్ ఎద్దేవా చేశారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భద్రాచలం పట్టణ ప్రజలకు డంపింగ్ యార్డ్ నిర్మాణం కొరకు నిధులు కేటాయించి నిర్మించింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిందాన్ని ప్రారంభించి మేమే చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, 15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం పట్టణాభివృద్ధికి శాశ్వత పరిష్కారం ఏమి చూపిందని ప్రశ్నించారు.

నియోజవర్గ ప్రధాన రహదారులు అధ్వానంగా తయారయ్యాయని దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామంలో వంతెన కూలిపోయి ఇప్పటికి ఏడుగురు మరణించారని అన్నారు. వెంకటాపురం మండలంలో ఇసుక లారీల లోడు తట్టుకోలేక మరో వంతెన కూలిపోయిందని, కనీసం నూతనంగా వంతెనలు నిర్మాణానికి అధికార ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, డైవర్షన్ రోడ్లు వేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ ప్రభుత్వంలో 38 కోట్ల రూపాయలతో కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే పనులు మధ్యలోనే ఆగిపోయాయని కనీసం ఒక రూపాయి కూడా అదనంగా కాంగ్రెస్ ప్రభుత్వం కరకట్ట మీద ఖర్చు చేయలేదని అన్నారు. కేవలం గత ప్రభుత్వం నిర్మించిన భవనాలు గత ప్రభుత్వం వేసిన రోడ్లు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఏద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని, ఈ ప్రచార ఆర్భాటాలు తగ్గించి ప్రజల పై దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, మండల పార్టీ కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, మండల పార్టీ సీనియర్ నాయకులు కొల్లం జయ ప్రేమ కుమార్, దుమ్ముగూడెం మండల నాయకులు బోల్లి వెంకటరావు, కాలువ పూర్ణయ్య, కొత్త మల్లేష్, భక్తుల నరసింహులు, అంబటి కర్ర కృష్ణ, ఇమంది నాగేశ్వరరావు, మొరాల డానియల్ ప్రదీప్, ఖాదర్, కొలిపాక శివ, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Similar News