సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కాయాకల్ప బృందం
మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలు,సౌకర్యాలపై కాయాకల్ప బృందం సందర్శించింది.

దిశ,నేలకొండపల్లి:మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలు,సౌకర్యాలపై కాయాకల్ప బృందం సందర్శించింది. సోమవారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహణ వ్యవస్థ యొక్క ఉన్నత ప్రమాణాలను బృందం ప్రశంసించింది. వారి సందర్శన సమయంలో, చర్ల కయాకల్ప్ బృందానికి డాక్టర్ రాజేశ్, సిబ్బంది అక్కడ అందుతున్న సేవలు వివరించారు. కయాకల్ప్ బృందంలో సాయి వర్ధన్,సీనియర్ నర్సింగ్ అధికారి శైలజ కలిసి అన్ని విభాగాలను మరియు వంటగదితో సహా వివిధ విభాగాలను సందర్శించింది. వారు అన్ని సంబంధిత డాక్యుమెంటేషన్ ప్రక్రియలను నిశితంగా సమీక్షించారు.
ఆసుపత్రిని భౌతికంగా తనిఖీ చేసి.. సిబ్బంది, రోగులతో సంభాషించారు. అసెస్మెంట్ బృందం ఆసుపత్రి పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఉన్నత నిర్వహణ ప్రమాణాలను పాటించినందుకు బృందం వారు ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రజారోగ్య సౌకర్యాలలో పరిశుభ్రత, , వ్యర్థాల నిర్వహణ ,ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్ధతులను మెరుగుపరచడం, ప్రోత్సహించడం అనే లక్ష్యంతో, స్వచ్ఛ భారత్ మిషన్ పొడిగింపు అయిన కయాకల్ప్ అవార్డు పథకాన్ని మే15, 2015న ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ప్రధాన వైద్యులు మంగళం, రాగ సుధా,డాక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.