ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ వాయిదా..

నూతన ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానూసారం.. జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లాలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ కి ఏర్పాటు చేసి వారిని పాత, కొత్తగూడెం ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి రమ్మని ఆదేశాలు జారీ చేశారు.

Update: 2024-10-15 05:33 GMT

దిశ, కొత్తగూడెం : నూతన ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానూసారం.. జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లాలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ కి ఏర్పాటు చేసి వారిని పాత, కొత్తగూడెం ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి రమ్మని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కౌన్సిలింగ్ సెంటర్ కి వచ్చిన ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ వాయిదా పడ్డట్టు తెలియడంతో గందరగోళానికి లోనయ్యారు. సెంటర్ నుండి వెను తిరిగారు. కౌన్సిలింగ్ కోసం మరొక తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు డీఈవో వారికి తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల తోటే ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ వాయిదా పడ్డట్టు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వర చారి స్పష్టం చేశారు. కౌన్సిలింగ్ వాయిదా పడడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


Similar News