మూడ్రోజులు ప్రజలకు కేసీఆర్ దూరం..కారణం ఇదే..!

ప్రజలతో ఆత్మీయ సమావేశాలకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మూడురోజుల విరామం ప్రకటించారు..

Update: 2024-06-28 16:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలతో ఆత్మీయ సమావేశాలకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మూడురోజుల విరామం ప్రకటించారు. శనివారం నుంచి సోమవారం వరకు దూరంగా ఉంటారని, కేసీఆర్‌కు విశ్రాంతినివ్వాలని పార్టీ నిర్ణయించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధినేతతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తిరిగి ప్రకటన తర్వాతే తదుపరి సమావేశాలు పున: ప్రారంభం అవుతాయని వెల్లడించింది. గత రెండు వారాలుగా అప్రతిహతంగా కేసీఆర్‌తో  ప్రజల ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయన్నారు. పదిహేనురోజుల్లో కేసీఆర్ ను దాదాపు 50వేల మంది కార్యకర్తలు, నేతలు, ప్రజలు కలిసినట్లు తెలిపారు. ఫొటోలు, సెల్ఫీలతో అధినేతను అభిమానం బంధీ చేసినదన్నారు. ఎంతో ఓపికతో గంటలపాటు నిలబడి తన ఆత్మబంధువులతో కేసీఆర్ గడిపినట్లు వెల్లడించారు. ఏయే నియోజకవర్గాల వారు ఎప్పడు రావాలనే విషయాలను, తర్వాతి ఆత్మీయ సమావేశాల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.


Similar News