రైస్ మిల్లర్ల ఇష్టారాజ్యం.. మురికి నీరును బయటకు వదులుతున్న వైనం

తంగళ్లపల్లి మండలం సారంపల్లి లోని ఓ బాయిల్డ్ రైస్ మిల్లర్ ప్రజల

Update: 2024-09-29 10:42 GMT

దిశ,తంగళ్ళపల్లి : తంగళ్లపల్లి మండలం సారంపల్లి లోని ఓ బాయిల్డ్ రైస్ మిల్లర్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. శ్రీనివాస మాడ్రన్ రైస్ మిల్ యాజమాన్యం చుట్టూ ప్రక్కల పర్యావరణాన్ని నాశనం చేయడమే కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా మురికి నీరును సిరిసిల్ల - సిద్దిపేట ప్రధాన రహదారి రోడ్డు బయటకు వదిలేస్తున్నారు. ఆ మురికి నీరు దుర్వాసన స్థానిక ప్రజలు, వాహన దారులు భరించలేక పోతున్నారు. రైస్ మిల్లు నుండి బయటకు వచ్చే నల్లని బూడిదను బయటకు వదులుతున్నారు. దీంతో చుట్టూ ఉన్న పొలాలను ఈ బూడిద కప్పేస్తూ వచ్చి పోయే వాహన దారుల కళ్ళలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పర్యావరణానికి అటు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న శ్రీనివాస బాయిల్డ్ రైస్ మిల్లు పై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, వాహన దారులు అధికారులను కోరుతున్నారు.


Similar News