Disha Effect : పేద కుటుంబం పై పోలీసుల పెద్ద మనసు

సమాజంలో విలువలు, మానవత్వం కోల్పోతున్న సమయంలో ఒక పేద కుటుంబంలో ఆ కుటుంబ పోషకుడు మరణిస్తే మేమున్నామంటూ హుజురాబాద్ పోలీసుల పెద్ద మనసు చాటుకున్నారు

Update: 2024-09-26 14:22 GMT

దిశ, హుజురాబాద్ రూరల్: సమాజంలో విలువలు, మానవత్వం కోల్పోతున్న సమయంలో ఒక పేద కుటుంబంలో ఆ కుటుంబ పోషకుడు మరణిస్తే మేమున్నామంటూ హుజురాబాద్ పోలీసుల పెద్ద మనసు చాటుకున్నారు. దిశ దిన పత్రికలో "ఎంత కష్టమొచ్చిందమ్మ"అని ప్రచురితం కాగా దీనికి హుజురాబాద్ పోలీసులు స్పందించారు. ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన కోట లక్ష్మణ్ మంగళవారం అనారోగ్యంతో మరణిస్తే గ్రామస్తులు, దాతల సహాయంతో దహన సంస్కారాలు నిర్వహించారు. గురువారం ఏసీపీ శ్రీనివాస్ జి ఆధ్వర్యంలో లక్ష్మణ్ కుటుంబానికి నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ జీ మాట్లాడుతూ... లక్ష్మణ్ ఘటన తమను చాలా బాధకు గురి చేసిందని అన్నారు. లక్ష్మణ్ కుటుంబానికి అండగా ఉంటామని, వారి పిల్లల చదువుకు పోలీసుల తరఫున సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News