Peddapalli MLA : రైతును రాజును చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

రైతును రాజును చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని,

Update: 2024-09-20 11:57 GMT

దిశ, సుల్తానాబాద్: రైతును రాజును చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని, రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎలిగేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహకార సంఘం వారు ఎమ్మెల్యే కు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతన్నలను ఏకం చేస్తూ రైతులందరిని ఒకే వేదికపై తీసుకువచ్చే సహకార సంఘాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే విజయ రమణ రావు అన్నారు. రైతుల పంటల కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి, రైతులకు సహకార సంఘాలు వారధిగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

రైతు రుణాల విషయంలో కూడా సహకార సంఘాలు ఎంతో తోడ్పడుతున్నాయి అని తెలిపారు.రైతు రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న మాటలు బోగస్ మాటలని విమర్శించారు. గత పాలకుల హయాంలో రైతుల పంటల విషయంలో తరుగు పేరిట రైతులను నట్టేట ముంచారని విమర్శించారు. ఈ వర్షాకాలపు సన్న రకం వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, మాజీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, సహకార సంఘం సభ్యులు, రైతులు, అధికారులు, ఎలిగేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామ రాజేశ్వర రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News