ఐక్యమత్యానికి నిదర్శనం గ్యార్మీ పండుగ

ఐక్యమత్యానికి నిదర్శనం గ్యార్మీ పండుగ అని పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు.

Update: 2024-10-23 12:12 GMT

దిశ, గోదావరిఖని : ఐక్యమత్యానికి నిదర్శనం గ్యార్మీ పండుగ అని పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో గ్యార్మీ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్యార్మీ పండుగను పురస్కరించుకుని ముస్లింలతో కలిసి పోలీస్ కమిషనర్, అధికారులు ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించారు. ప్రతి ఏటా గ్యార్మీ పండుగను ఎంతో సంతోషంగా, భక్తి శ్రద్దలతో జరుపుకుంటారని అన్నారు.

    ప్రతి ఒక్కరూ మహమ్మద్‌ ప్రవక్త సూచించిన మార్గంలో నడుచుకోవాలని, ఇతరుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలన్నారు. అనంతరం గోదావరిఖని 5 ఇంక్లైన్ లోని మదర్సాలో ఉండే పిల్లలకు సీపీ దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏసీపీ ఏఆర్ సుందర్ రావు, ఆర్ఐ లు దామోదర్, మల్లేశం, శ్రీనివాస్, సంపత్, సీఐ లు, ఇన్స్పెక్టర్లు ,వివిధ వింగ్స్ లోని ఎస్ఐ లు సిబ్బంది, మతపెద్దలు పాల్గొనారు.  

Tags:    

Similar News