కరీంనగర్ లో చిల్లర దొంగల బీభత్సం..

కరీంనగర్ నగరంలోని భాగ్యనగర్, సంతోష్ నగర్ లో వరుస చోరీలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

Update: 2024-06-18 15:31 GMT

దిశ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని భాగ్యనగర్, సంతోష్ నగర్ లో వరుస చోరీలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా దుండగులు చిల్లర దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. కాలనీలోని ఇండ్లలో పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించగా అక్కడే కాలనీవాసుల ఇండ్లలోని సీసీ ఫుటేజ్ లో దొంగ దృశ్యాలు లభ్యమయ్యాయి.

సంతోష్ నగర్ లోని ఒకే వీధిలో తరచూ ఏదో ఒక ఇంట్లో కనిపించిన విలువైన వస్తువులు ఎత్తుకెళ్తున్నారు. ఓ ఇంట్లో రెండు క్వింటాళ్ల బియ్యంతో పాటు, సిలిండర్లు ఎత్తుకెళ్లారు. ఓ కొత్త ఇంటి నిర్మాణంలో లిఫ్ట్ కోసం తెచ్చిన గేటును కూడా ఎత్తుకెళ్లారు. ఓ కారుతో పాటు, దాదాపు 8 ఇండ్లలో విలువైన వస్తువులతో పాటు చిల్లర దొంగతనాలు చేశారు దొంగలు. ఈ ఘటనల పై పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా టూటౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.


Similar News