నీట్ పై కేంద్రం తక్షణమే సమగ్ర విచారణ జరపాలి : రవి గౌడ్

నీట్ పై కేంద్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు.

Update: 2024-06-18 13:14 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : నీట్ పై కేంద్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాలోని తంగనపల్లి మండలం కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ నిర్వహణలో జరిగిన అవకతవకల పై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి బాద్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కష్టపడి చదివి పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులకు వారి తల్లితండ్రులకు భరోసా ఇవ్వాలని, దేశవ్యాప్తంగా ఈ పరీక్షలో జరిగిన అవకతవకలను నిగ్గు తేల్చాలని, నీట్ అక్రమాల పైన ప్రధాని మోదీ నోరు తెరువాలన్నారు. గుజరాత్ లో నీట్ పరీక్ష పత్రాలు అమ్ముకున్న వైనం పైన ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదని, నీట్ అక్రమాలతో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది అని ఆవేదన వ్యక్తం చేశారు.

మొదటి నుంచే నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తుందని, గతంలో ఎప్పుడు లేని విధంగా నీట్ పరీక్షల్లో 67 మంది కి ఫస్ట్ ర్యాంక్ రావడం ఎన్నో రకాల అనుమానాలకు దారి తీస్తుందని మండిపడ్డారు. ఒకే సెంటర్ నుండి ఎనిమిది మంది విద్యార్థులు 720 మార్కులు సాధించడం చూస్తే పెపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థం అవుతుందన్నారు. ఎడ్యుకేషన్ హబ్ గా ఉన్న తెలంగాణలో కూడా 150 వరకు ఒక్క ర్యాంక్ రాకపోవడం నీట్ అక్రమాలకు అద్దం పడుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు నోరు మెదపకపోవడం దురదృష్టకరమని, అంతే కాకుండా గ్రెస్ మార్కుల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరపున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్ నాయకులు, నవీన్, ఒగ్గు అరవింద్, రుద్రవేనీ సుజిత్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


Similar News