ప్రముఖ టాలీవుడ్ స్టార్ కు చెందిన జయభేరీ సంస్థలకు.. హైడ్రా నోటీసులు!

హైదరాబాద్ నగర వ్యాప్తంగా.. చెరువులు, కుంటల పరిరక్షణకు శ్రీకారం చుట్టిన హైడ్రా తన దూకుడును కొనసాగిస్తోంది.

Update: 2024-09-07 08:45 GMT

దిశ, శేరిలింగంపల్లి: హైడ్రా తన దూకుడు కొనసాగిస్తుంది. పండగలు, సెలవు రోజులు అనేవి చూడకుండా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో నిర్మాణాల నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే సినీహీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చిన హైడ్రా తాజాగా మరో నటుడు మురళీమోహన్ కు చెందిన జయభేరి సంస్థకు నోటీసులు జారీ చేసింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణం సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం భగీరథమ్మ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణ వ్యర్ధాలను వేయడంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. మరో 15 రోజుల్లో పూర్తిస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.


Similar News