ర్యాగింగ్ చేస్తున్నారంటూ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఫిర్యాదు

తన కుమారుడిని సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తూ ఇబ్బందులకు

Update: 2024-09-27 11:02 GMT

దిశ, శేరిలింగంపల్లి : తన కుమారుడిని సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గురువారం రాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీఏ చదువుతున్న తన కుమారుడు వైష్ణవ్ ను సీనియర్లు తరచూ ర్యాగింగ్ చేస్తున్నారని, అదే కాలేజీలో చదువుతున్న సీనియర్ విద్యార్థి శ్యామ్ బస్ లో వైష్ణవ్ తో గొడవ పడి చెవి కొరికినట్లు పట్నాయక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లామని అయిన ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆర్పీ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు సీనియర్ విద్యార్థి శ్యామ్ పై కేసు నమోదు చేశారు. ఆర్పీ పట్నాయక్ తనయుడు వైష్ణవ్ ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.


Similar News