HYD : కత్తులతో బెదిరించి రూ.50 లక్షలు చోరీ
రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో సంచలన ఘటన చోటు చేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో సంచలన ఘటన చోటు చేసుకుంది. బ్యాటరీ ఫ్యాక్టరీలో దొంగలు చొరబడి రూ.50 లక్షలు చోరీ చేశారు. కత్తులతో వాచ్మెన్ను బెదిరించి రూ.50 లక్షలు దొంగిలించారని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.