అధికారులే నిజమైన అంధులు.. TG హైకోర్టు సీరియస్

వికలాంగుల సంక్షేమశాఖ అధికారులపై హైకోర్టు(Telangana High Court) సీరియస్ అయింది. అంధులను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని మండిపడింది.

Update: 2025-04-07 11:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: వికలాంగుల సంక్షేమశాఖ అధికారులపై హైకోర్టు(Telangana High Court) సీరియస్ అయింది. అంధులను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని మండిపడింది. వికలాంగులు బాధితులు కాదని.. అధికారులే నిజమైన అంధులు అని జస్టిస్ భీమపాక నగేశ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల నుంచి తొలగించడంపై 2017లో అంధ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఆ పిటిషన్‌ను హైకోర్టు విచారించి పైవ్యాఖ్యలు చేసింది. అధికారుల పనితీరు, నిర్లక్ష్యం కారణంగా తాము ఎంతోత నష్టపోయామని వికలాంగులు ఆవేదన చెందారు. మరోవైపు.. రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించ‌కుండా, వారిని చిన్నచూపు చూస్తున్నారని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నేతలు అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది దివ్యాంగులు అనేక సమస్యలతో అల్లాడిపోతూ దుర్భర జీవితాలు గడుపుతున్నారని.. తక్షణమే ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ రూ.6 వేల‌కు పెంచుతామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల సంక్షేమ శాఖను వేరుచేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామ‌ని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసి.. తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News