హైడ్రాపై హైకోర్టు సీరియస్.. కమిషనర్ రంగనాథ్‌కు నోటీసులు

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌(Ranganath)పై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2024-09-27 12:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌(Ranganath)పై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. దీనిపై వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు సమాధానం చెప్పాలని సీరియస్ అయ్యింది. వచ్చే సోమవారం ఉదయం 10.30 గంటలకు కోర్టులో హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది. కాగా, అమీన్‌పూర్‌లో ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా కూల్చేసిన విషయం తెలిసిందే. పెద్దచెరువు కబ్జా చేసి ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఇళ్లు కట్టారని హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో,​ చెరువు పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.


Similar News