శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పసుపులేటి గోపి కిషణ్‌..

శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నియమించడం జరిగింది.

Update: 2023-06-28 09:56 GMT

దిశ, హిమాయత్ నగర్: శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నియమించడం జరిగింది. నిజామాబాద్ బోధన్‌కి చెందిన పసుపులేటి గోపి కిషణ్‌‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శివ సేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ నియమించారు. గతంలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేసిన వ్యక్తికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం విశేషం.


బోధన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వివాదం కేసులో A1 కూడా ఇతనే, స్వయంగా నేనే విగ్రహం పెట్టానని మీడియా ముందుకు వచ్చి రెండు వారాల పాటు జైలుకు వెళ్లిన వ్యక్తికి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇవ్వడం పట్ల శివ సైనికులు, తన కుటుంబ సభ్యులు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పసుపులేటి గోపి కిషణ్‌ 2019 ఎన్నికలలో శివసేన పార్టీ నుంచి ఎమ్ఎల్ఏ అభ్యర్థిగా బోధన్ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యడం జరిగింది.

Tags:    

Similar News