సంగారెడ్డి ప్రమాదంపై మాజీ సీఎం KCR దిగ్భ్రాంతి..

సంగారెడ్డి జిల్లాలో ఎస్బీ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

Update: 2024-04-03 15:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలో ఎస్బీ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందుతూ సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.


Similar News