కేంద్ర బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం.. ఢిల్లీలో టీ కాంగ్రెస్ ఎంపీలు

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేపట్టారు.

Update: 2024-07-25 07:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఈ మేరకు నాగర్ కర్నూల్ లోక్ సభ ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే అమలు చేసేలా బడ్జెట్ లో హామీలు, కేటాయింపులు ఉన్నాయన్నారు. తెలంగాణలోని పాత జిల్లాలలో 9 జిల్లాలకు వెనుకబడిన ప్రాంత నిధులు ఇస్తామని హామీ ఇచ్చి దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదన్నారు. తెలంగాణకు బడ్జెట్‌లో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రధాని, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రికి లేఖలు రాశామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులను మేము వ్యతిరేకించడం లేదని, తెలంగాణకు కేటాయింపులు జరపాలని కోరినట్లు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ బీజేపీతో రాజీపడిందని ఆరోపించారు. బడ్జెట్‌పై చర్చ సంధర్భంగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని లేవనెత్తుతామని, తెలంగాణకు న్యాయం జరిగేంత వరకు పార్లమెంట్ లో పోరాటం చేస్తామన్నారన్నారు.

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని బీజేపీ ఎంపీలు వమ్ము చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నప్పటికీ న్యాయం జరగలేదన్నారు. విభజన చట్టం 2014 లో ఉంటే అప్పటి నుంచి లేని కేటాయింపులు ఈసారి బడ్జెట్ లోనే ఎందుకు చేశారని ప్రశ్నించారు. ప్రధాని కుర్చీ కాపాడుకునేందుకే బడ్జెట్ లో నితీశ్, చంద్రబాబు రాష్ట్రాలకు న్యాయం చేశారని చెప్పుకొచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఎంపీలు తెలంగాణకు జరిగిన అన్యాయంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News