ED Raids: మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ రెయిడ్స్.. ఏకకాలంలో 16 చోట్ల కొనసాగుతోన్న సోదాలు

రాష్ట్రంలో మరోసారి ఈడీ (Enforcement Directorate) అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి.

Update: 2024-09-27 04:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరోసారి ఈడీ (Enforcement Directorate) అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) నివాసంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 16 బృందాలుగా విడిపోయిన అధికారులు హైదరాబాద్‌ (Hyderabad)లోని నందగిరి హిల్స్‌లో ఉన్న మంత్రి నివాసం, హిమాయత్ సాగర్‌లోని ఫామ్‌ హౌజ్, పొంగులేటి కుమార్తె, బంధువుల ఇళ్లతో కలిపి మొత్తం 16 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ముందుగా మంత్రి ఇంట్లోకి మూకుమ్మడిగా ప్రవేశించిన ఈడీ అధికారులు ఎక్కడి వారు అక్కడే ఉండాలంటూ ఆదేశించారు. తనిఖీ సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా సీఆర్‌పీఎఫ్ (CRPF) పోలీసుల భద్రత నడుమ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.


Similar News