ఎన్ని పెట్టుబడులు వస్తాయో చూద్దాం.. CM రేవంత్ విదేశీ పర్యటనపై డీకే అరుణ కామెంట్

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ కీలక నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2024-08-12 12:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ కీలక నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. అబద్ధపు హామీలతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. సరిగా అమలు చేయడం చేతగాక ప్రతి హామీలోనూ కోత పెడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే రైతు రుణమాఫీ లెక్కలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు అన్నీ కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు. పెట్టుబడుల కోసం అమెరికా పర్యటన పేరుతో సీఎం రేవంత్ రెడ్డి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. అసలు రేవంత్ పర్యటనతో రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వస్తాయో చూడాలని అనుమానం వ్యక్తం చేశారు. కొత్త కంపెనీలు వస్తాయో లేక.. పాత కంపెనీలతోనే హడావుడి చేస్తారో చూడాలని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News