హైడ్రాపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

హైడ్రా(Hydra)పై బీజేపీ లోక్ సభ ఎంపీ డీకే అరుణ(DK aruna) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-27 11:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా(Hydra)పై బీజేపీ లోక్ సభ ఎంపీ డీకే అరుణ(DK aruna) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోందని మండి పడ్డారు. 'సంచులే' లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అనుకూల బడా వ్యాపారుల అక్రమ స్థలాలపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేస్తున్న దోపిడీని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇక వక్ఫ్ బోర్డ్ సవరణల బిల్లుపై ఏర్పాటైన జేపీసీ కమిటీ (JPC Committee) శనివారం హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో.. ముస్లిం పెద్దలు తమ అభ్యంతరాలను కమిటీకి విన్నవించవచ్చునని తెలిపారు. ముస్లింలకు న్యాయం చేయడం కోసమే వక్ఫ్ బోర్డుకు కేంద్రం సవరణలు చేపట్టేందుకు సిద్ధమైందని డీకే అరుణ పేర్కొన్నారు.     


Similar News