రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మార్పు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.

Update: 2024-08-21 12:13 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ నాయకులతో ముఖ్యమైన సమావేశంలో పాల్గొనడానికి సీఎంకు ఈ పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల విజయం జోరులో ఉన్న కాంగ్రెస్.. ఆ పార్టీలో భారీ మార్పులు చేయనున్నట్టు చర్చ నడుస్తుంది. లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు చేపట్టనున్నారని సమాచారం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు, పలు రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ లను మార్చాలనేది రాహుల్ ఉద్దేశం అని ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపా దాస్ ను పశ్చిమ బెంగాల్ కు పంపి, తెలంగాణకు భూపేష్ భగీల్ ను నియమించనున్నారని కాంగ్రెస్ వర్గాల తాజా సమాచారం. ఇందుకోసమే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ తో సమావేశం అవనున్నారా అని రేవంత్ వర్గం చర్చించుకుంటున్నారు.  

Tags:    

Similar News