PC GHOSH: అవి డిజైన్ లో లేని పనులే.. పీసీ ఘోష్ కమిషన్ కు వివరించిన సీడీవో ఎస్ఈ ఫజల్

కాళేశ్వరం కమిషన్ ముందు సీడీవో ఎస్ఈ ఫజల్ హాజరయ్యారు.

Update: 2024-08-23 09:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లోని అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కంటిన్యూ చేస్తున్నది. శుక్రవారం కమిషన్ ముందు నీటి పారుదల శాఖ సీడీవో ఎస్ఈ ఫజల్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషన్ కు పలు కీలక అంశాలను వెల్లడించారు. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో సీకెంట్ ఫైల్ కు వెళ్లాలని కాళేశ్వరం సీఈ చెప్పారని అలాగే సుందిళ్ల రెండో బ్లాక్-ఏ లో అదనపు 6 వెంట్లు డిజైన్ లో లేనప్పటికీ ఆ తర్వాత మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో అదనపు వెంట్లు వెసినట్లు వివరించారు. క్రాస్ సెక్షన్స్ కాళేశ్వరం సీఈ నివేదిక మేరకు ఆమోదించినట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఆనకట్టల నిర్మాణ స్థలాన్ని పరిశీలించకుండానే వాటిని ఆమోదించినట్లు వెల్లడించారు.

రెండో రోజు విచారణకు నరేందర్ రెడ్డి:

సీడీవో విశ్రాంత ఈఎన్సీ నరేందర్ రెడ్డి రెండోరోజైన గురువారం కూడా పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. నిన్నటి విచారణకు కొనసాగింపుగా ఇవాళ 2 లేఖలను కమిషన్ కు నరేంద్ర రెడ్డి అందజేశారు. కాగా నిన్నటి విచారణలో డిజైన్ల ఖరారు విషయంలో కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఒత్తిడి చేశారని నరేందర్ రెడ్డి కమిషన్ కు వివరించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News