BREAKING : రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Update: 2024-07-23 08:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మంగళవారం మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేబినెట్ సబ్ కమిటీ వేసి కొత్త రేషన్ కార్డులపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రేషన్ కోసం మాత్రమే రేషన్ కార్డు అని.. హెల్త్ కార్డు కోసం ఆరోగ్య శ్రీ అని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రం లో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. కేటీఆర్ మాటలకు తాను సమాధానం చెప్పనని.. ఎక్కడో పారే నీళ్లను చూసి కేటీఆర్ ఏదో మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ బాగుంటే ఎందుకు కుంగిపోయిందన్నారు. బ్యారేజీ కుంగిపోయినప్పుడు బీఆర్ఎస్ ఎందుకు బాంబు పెట్టారని కంప్లైంట్ చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు బ్యారేజీ ఎన్నిసార్లు చూసిన పర్వాలేదని సూచించారు. 

Tags:    

Similar News