మాకూ ఓటు హక్కు కల్పించండి.. ఈసీని కలిసిన టీచర్లు

రాష్ట్రంలో రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లకు ఓటు హక్కు కల్పించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్ రావు, నవాత్ సురేశ్ డిమాండ్ చేశారు.

Update: 2024-09-27 16:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లకు ఓటు హక్కు కల్పించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్ రావు, నవాత్ సురేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి అందజేశారు. కాగా దీనిపై సుదర్శన్ రెడ్డి భారత ఎన్నికల కమిషన్ అధికారులకు లేఖ రాస్తామని చెప్పారని సంఘం నాయకులు వివరించారు. వినతి అందించిన వారిలో టీపీయూఎస్ అసోసియేట్ అధ్యక్షురాలు బీ ఉషారాణి, నాయకులు శ్రీహరి కృష్ణ, కాశీరావు, సిద్దిలింగప్ప ఉన్నారు.


Similar News