తెలంగాణ అసెంబ్లీలో గుండెలను హత్తుకునేలా మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం అర్ధరాత్రి వరకు జరిగాయి. ఈ సమావేశాల్లో ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

Update: 2024-07-30 06:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం అర్ధరాత్రి వరకు జరిగాయి. ఈ సమావేశాల్లో ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయాలని.. ఇతర దేశాలకు కార్మికులుగా వెళ్లిన వారి బ్రతుకులు ఆగమ్యగోచరంగా మారిపోతున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే తన నియోజకవర్గంలో స్కూల్ల పరిస్థితి దయనీయంగా మారిపోయిందని.. సగం కూలిన గోడలు, తుప్పు పట్టిన ఇనుము తో కూడి పిల్లర్లు కూలిపోతున్నాయని.. దయచేసి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని,, చేతులెత్తి మొక్కుతున్నానని.. తన నియోజకవర్గానికి నిధులు వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడిన తీరు ప్రజల హృదయాలకు హత్తుకునేలా ఉంది. దీంతో సభలో ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తనను నమ్ముకున్న నియోజకవర్గ ప్రజల కోసం ప్రతి నేత ఇలాగే ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News