'ప్రభుత్వానికేం సంబంధం'.. స్మితాసబర్వాల్ ట్వీట్స్ దుమారంపై భట్టి సంచలన వ్యాఖ్యలు

స్మితాసబర్వాల్ ట్వీట్స్ రచ్చపై భట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-23 11:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రుణమాఫీ విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడవద్దని, రుణమాఫీపై ప్రజలు, రైతులు సంతోషంగా ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాది ప్రజా ప్రభుత్వం.. అని ప్రతి అంశంలో ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, డే స్కూల్ కాకుండా సెమీ అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వ విద్య కంటే మెరుగైన విద్యను అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా ఒక్కో పాఠశాల కోసం రూ.80 నుంచి 100 కోట్లు ఖర్చు చేయబోతోందని వెల్లడించారు. ఒక్రేజ్, బిర్లా ఓపెన్ స్కూల్స్ టైప్ ప్రభుత్వ పాఠశాలలు రాబోతున్నాయని చెప్పారు. బీఏసీలో బీఆర్ఎస్ నాయకుల పేర్లు మార్చుకున్నారని, అందుకే సమావేశం ఆలస్యం అయిందన్నారు. అఖిల భారత సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగుల కోటా విషయంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని, స్మితా సబర్వాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News