Auto Driver: శభాష్ డ్రైవరన్న.. అధికారులు చేయని పనిని చేసి చూపించారు

ఆటో డ్రైవర్ చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.

Update: 2024-09-06 09:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని ఓ మహా కవి చెప్పిన మాటలు మనసున పెట్టుకున్నాడో ఏమో కానీ ఓ ఆటో డ్రైవరన్న చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. పాలకులు, అధికారులు చేయలేని పనిని మీరు చేశారంటూ అభినందిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కామారెడ్డి పట్టణం అశోక్ నగర్ కాలనీ నుంచి కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లే రూట్లో రైల్వే గేట్ వద్ద రోడ్డు డ్యామేజ్ అయింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారుల వెన్నులో వణుకుపుడుతోంది. ఈ సమస్యను ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో వారిని నమ్ముకుంటే పని కాదనుకున్న ఓ ఆటో డ్రైవర్ తానే ఏదైనవా చేయాలని భావించాడు. వెంటనే తన ఆటోలో ఇటుకలు, మట్టిని తీసుకువచ్చి గుంతలు పూడ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా శభాష్ డ్రైవరన్న అంటూ అభినందిస్తున్నారు. 


Similar News