ఈఆర్సీలో 10 మంది సిబ్బంది నియామకం.. ఉత్తర్వులు జారీ
తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 10 మంది సిబ్బందిని నియమించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 10 మంది సిబ్బందిని నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలు పోస్టుల్లో పలువురిని నియమించింది. అందులో లైబ్రేరియన్గా తాటి రాజ్ కుమార్, క్యాషియర్గా శ్రీనివాస్రావును నియమించింది. అదేవిధంగా రిసెప్షనిస్ట్గా దేవనగిరి దివ్య సైని, స్టెనో, కమ్ కంప్యూటర్ ఆపరేటర్లుగా ఎట్టె సాయి ప్రసన్న, బొల్లు రాహుల్ ఆదిత్య అనే ఇద్దరిని నియమించింది.
ఆఫీస్ సబార్డినేట్లుగా ఐదుగురిని నియమించింది. అందులో తలారి రామకృష్ణ, పొన్నాల బాలకృష్ణ, మౌనిక, సాయప్ప, అరిగె కరుణాకర్ ఉన్నారు. అయితే, ఇప్పుడు వారి నియామకంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హడావుడిగా నియామకం ఎందుకు చేపట్టారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ నెల 29తో ఈఆర్సీ పాలక మండలి పదవీ కాలం ముగియనుంది. కాగా, ఈ తరుణంలో కొత్త సిబ్బందిని నియమించడం పలు అనుమానాలకు తావిస్తోందని చర్చించుకుంటున్నారు.