కుక్కల దాడిలో కృష్ణ జింక మృతి...

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడా గ్రామంలో పిచ్చికుక్కల దాడిలో కృష్ణ జింక మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.

Update: 2024-06-18 13:19 GMT

దిశ, చింతలమానేపల్లి : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడా గ్రామంలో పిచ్చికుక్కల దాడిలో కృష్ణ జింక మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఫారెస్ట్ రేంజ్ అధికారి పూర్ణచంద్ తెలిపిన వివరాల ప్రకారం పొలాల్లో కృష్ణ జింకలు ఆహారం కోసం గుంపులు గుంపులుగా తిరుగుతూ మేత కొరకు వస్తూ ఉంటాయి.

ఈ క్రమంలోనే ఓ కృష్ణ జింకను పిచ్చి కుక్కలు వేటాడడంతో పొలాల నుంచి బాలాజీ అనుకోడా గ్రామం వైపు పరుగులు తీస్తూ గ్రామంలోకి రావడాన్ని గ్రామస్తులు గమనించారు. కుక్కల దాడి నుంచి కృష్ణ జింకను కాపాడి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు బాలాజీ అనుకొడా గ్రామంలో రావడంతో కృష్ణ జింకను ఫారెస్ట్ అధికారులకు అప్పజెప్పారు. ఈ దాడిలో గాయపడిన కృష్ణజింకను వైద్యం కోసం తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు.


Similar News