భైంసా లో మరోసారి రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు...

పట్టణంలో మరోసారి చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. నెంబర్ ప్లేట్ లేని బండి పై వచ్చి ఇద్దరు దుండగులు రాహుల్ నగర్ లో గంగాదేవి అనే వృద్ధ మహిళ నుంచి 5 తులాల బంగారు గొలుసు అపహరణ చేశారు.

Update: 2024-10-02 16:31 GMT

దిశ, భైంసా: పట్టణంలో మరోసారి చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. నెంబర్ ప్లేట్ లేని బండి పై వచ్చి ఇద్దరు దుండగులు రాహుల్ నగర్ లో గంగాదేవి అనే వృద్ధ మహిళ నుంచి 5 తులాల బంగారు గొలుసు అపహరణ చేశారు. వరుస ఘటనలతో ఒంటరిగా బయటకు వెళ్లాలంటే మహిళలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత రెండు నెలల్లో 6 చైన్ స్నాచింగ్ లు కాగా, కేవలం 15 రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. బాధితురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దుండగులను వెతికే పనిలో పడ్డారు. సీసీ కెమెరాలో చిక్కిన దుండగులకు సంబంధించి ఒక చిత్రాన్ని సామాజిక మాధ్యమాలలో ఉంచి, ఇట్టి వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.


Similar News