దిశ, వెబ్డెస్క్: రాజ్కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్ 4 బ్యాటర్లు వార్నర్ (56), మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబూషేన్ (72) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఆసీస్ టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్ బుమ్రా తన వన్డే కెరీర్లో చెత్త గణాంకాల రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్లో 10 ఓవర్లు వేసిన బుమ్రా 3 వికెట్లు పడగొట్టినప్పటికీ (81) పరుగులు సమర్పించుకున్నాడు. 2017లో కటక్తో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లోనూ బుమ్రా ఇలాగే 81 పరుగులు సమర్పించుకున్నాడు.