China Open 2024: రోహన్ బోపన్న జోడికి బిగ్ షాక్.. తొలిరౌండ్లోనే ఓటమి
చైనా(China)లోని బీజింగ్(Beijing) వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్(China Open) ఏటీపీ 500 టోర్నీలో బోపన్న(ఇండియా)-ఇవాన్ డోడిగ్(క్రొయేషియా) జోడికి తొలి రౌండ్లోనే చుక్కెదురైంది.
దిశ, వెబ్డెస్క్:చైనా(China)లోని బీజింగ్(Beijing) వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్(China Open) ఏటీపీ 500 టోర్నీలో రోహన్ బోపన్న(ఇండియా)-ఇవాన్ డోడిగ్(క్రొయేషియా) జోడికి తొలి రౌండ్లోనే చుక్కెదురైంది.శనివారం జరిగిన పురుషుల డబుల్స్ మొదటి రౌండ్ లో బోపన్న ద్వయానికి ఫ్రాన్సిస్కో సెరుండోలో(అర్జెంటీనా),నికోలస్ జారీ(చిలీ)లు ఊహించని షాక్ ఇచ్చారు. ఒక గంట 31 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో ఫ్రాన్సిస్కో, నికోలస్ ద్వయం బోపన్న జంటకు గట్టి పోటీనిచ్చింది. తొలి సెట్ను ఒక్క పాయింట్ తేడాతో గెలుపొందిన నికోలస్ ద్వయం అదే ఊపుతో రెండో సెట్ను కూడా సొంతం చేసుకుంది.దీంతో బోపన్న జోడి 5-6, 6-7 తేడాతో ఓడి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు.కాగా బోపన్న యూఎస్ ఓపెన్లోనూ క్వార్టర్స్కు ముందే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే.