కేరళలో కమలం కుళ్ళిపోయిందని Amit Shah కు సీపీఎం కౌంటర్..

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ శనివారం కేరళ లో నిర్వహించిన ఎస్పీ మోర్చా సభలో అమిత్ షా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల ను విమర్శించారు.

Update: 2022-09-04 13:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ శనివారం కేరళ లో నిర్వహించిన ఎస్పీ మోర్చా సభలో అమిత్ షా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల ను విమర్శించారు. కాంగ్రెస్ ,కమ్యూనిస్టు పార్టీలు అంతరించిపోయాయని కేరళ భవిష్యత్తు బీజేపీదే అని అన్నారు. అంతేకాకుండా ఎస్పీ, ఎస్టీ ,బీసీల వర్గాల ఓటర్లు ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలపై కేరళ సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి ఎంఏ బేబి స్పందిస్తూ.. బీజేపీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేయడంతో పెరిగిందని. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలను, ఎమ్మెల్యేలను కొనడం అలవాటు అయిపోయి అవినీతి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేరళ లో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానం గెలుచుకోగా 2021లో ఉన్న ఒక్క స్థానంలో వికసించిన కమలం కుళ్ళిపోయిందని ఎద్దేవా చేశారు. కేరళ లో బీజేపీదే భవిష్యత్తు అని అమిత్ షా పగటి కలలు కంటున్నారు అని అన్నారు.

Tags:    

Similar News