Varun Sandesh: ఓటీటీలోకి వరుణ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన మూవీ క్రైమ్ థ్రిల్లర్ ‘నింద’.

Update: 2024-09-04 13:26 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన మూవీ క్రైమ్ థ్రిల్లర్దీNindha Movie Reviewనిని రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించగా.. యానీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్యకుమార్, మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ఛత్రపతి శేఖర్ కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా 2024 జూన్ 21న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

తాజాగా నింద మూవీ రిలీజ్ అయిన రెండున్నర నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. దీని ఓటీటీ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుందని ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేశారు. అలాగే ‘‘మంచోడికి న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయిన రోజు.. ఒక సమాజం చనిపోయినట్టే సెప్టెంబర్ 6న నింద ప్రీమియర్’’ అనే క్యాప్షన్ జత చేసి షేర్ చేశారు.


Similar News