అసదుద్దీన్ ఇంటి వద్ద వీహెచ్పీ ఆందోళన..కారణమిదే?
లోక్ సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా హైదరాబద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా నినాదాలు చేసిన విషయం తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా హైదరాబద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా నినాదాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ 34 అశోకా రోడ్లోని ఒవైసీ నివాసం వద్ద ఆదివారం విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ), భజరంగ్ దళ్ నేతలు ఆందోళన చేపట్టారు. ఓవైసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. భారత్లో ఉంటుకుంటూ పాలస్తీనా నినాదాలు చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. పాలస్తీనా మీద ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోవాలని ఆరోపించారు. ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బ్యారీకేడ్లపైకి ఎక్కి నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 28న కూడా ఓవైసీ ఇంటి గోడలపై గుర్తుతెలియని వ్యక్తులు ఇజ్రాయెల్ అనుకూల పోస్టర్లు వేసి, నేమ్ ప్లేట్పై నల్ల ఇంకును పోశారు.