Khalistani Terrorist: పన్నూ హత్య కుట్ర కేసులో భారత్ పై అమెరికా ఆరోపణలు

ఖలిస్థానీ వేర్పాటువాది గురపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్రపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది.

Update: 2024-10-18 04:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ వేర్పాటువాది గురపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్రపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. పన్నూను హతమార్చేందుకు భారత రా అధికారి కుట్ర పన్నారని అమెరికా న్యాయ శాఖ తీవ్ర ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ దాడులు చేసేందుకు యత్నించారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. అయితే, పన్నూ హత్యకు కుట్రకు భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారి హస్తం దన్నారు. హత్యకు కుట్ర చేసిన అధికారిని వికాస్ యాదవ్ (39)గా గుర్తించామని.. అతను భారత విదేశీ గూఢచార సేవ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW)లో పని చేశాడని చెప్పుకొచ్చారు. అలాగే, సదరు భారత రా ఏజెంట్ పన్నూ హత్యతో పాటు మనీ లాండరింగ్ కోసం ప్రయత్నించాడని అమెరికా న్యాయ శాఖ వెల్లడించింది.

నిఖిల్ గుప్తాపై ఆరోపణలు

అయితే, పన్నూ హత్యకు కుట్ర పన్నిన ప్రధాన నిందితుడిగా నిఖిల్ గుప్తాను అమెరికా గుర్తించింది. అతడ్ని చెక్ రిపబ్లిక్ లో అరెస్టు చేసిన తర్వాత అక్కడి అధికరులు నిందితుడ్ని అమెరికాకు అప్పగించారు. నిఖిల్ గుప్తా సదరు రా ఏజెంట్ వికాస్ యాదవ్ గురించి అమెరికన్ ఏజెన్సీలకు సమాచారం ఇచ్చారని పేర్కొంది. కాగా, పన్నూని హత్య చేయమని భారతీయ అధికారి (కోడ్ పేరు-సిసిఒన్) తనకు సూచించారని నిఖిల్ గుప్తా స్వయంగా చెప్పాడని యూఎస్ ఏజెన్సీలు వెల్లడించాయి. పన్నూ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై భారత ‘ఇన్వెస్టిగేటివ్ కమిటీ’ కూడా దర్యాప్తు చేస్తుంది. ఇక, అమెరికాలో ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూని హత్య కుట్రకు సంబంధించిన కేసులో భారత దర్యాప్తు కమిటీతో అమెరికా అధికారులు గురువారం భేటీ అయ్యారు. అయితే, జరిగిన సమావేశం సానుకూలంగా ఉందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. “వారి విచారణ, సహకారంతో మేము సంతృప్తి చెందాం. రా అధికారి వికాస్ యాదవ్ ఇకపై భారత ప్రభుత్వ ఉద్యోగి కాదు” అని మిల్లర్ వెల్లడించారు. కాగా, ఖలీస్థాన్ ఉగ్రవాది పన్నూని భారత ప్రభుత్వం ఇప్పటికే ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అయితే అతను కెనడా- అమెరికాలలో నిరంతరం భారత వ్యతిరేక ర్యాలీలు, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. పన్నూ స్థాపించిన సిక్కు ఫర్ జస్టిస్ అనే సంస్థను భారత్ నిషేధించింది.


Similar News