Reservations : “ఆ రిజర్వేషన్లు అక్కర్లేదు’’..కర్ణాటక ప్రభుత్వంపై కేరళ మంత్రి ఫైర్

దిశ, నేషనల్ బ్యూరో : ప్రైవేట్ రంగంలో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే ముసాయిదా బిల్లును కర్ణాటక ప్రభుత్వం రూపొందించడంపై కేరళ మంత్రి పి రాజీవ్ భగ్గుమన్నారు.

Update: 2024-07-18 18:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ప్రైవేట్ రంగంలో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే ముసాయిదా బిల్లును కర్ణాటక ప్రభుత్వం రూపొందించడంపై కేరళ మంత్రి పి రాజీవ్ భగ్గుమన్నారు. ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటక సర్కారు భావించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిభావంతులైన యువతకు రిజర్వేషన్ల అవసరమే లేదని రాజీవ్ స్పష్టం చేశారు. తమ రాష్ట్రం (కేరళ)లో ఏ కంపెనీ పెట్టుబడి పెట్టినా ట్యాలెంట్ కలిగిన యువతను ఉద్యోగాలకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కల్పిస్తామని ఆయన తెలిపారు.

అయితే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాధాన్యతా రంగాల్లోని ఉద్యోగ అవకాశాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యత దక్కేలా కేరళ పారిశ్రామిక విధానం ఉంటుందన్నారు. కాగా, కన్నడిగులకు ప్రైవేట్ రంగ సంస్థలు, పరిశ్రమలు, సంస్థల అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టుల్లో 50 శాతం, నాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టులలో 75 శాతం రిజర్వేషన్లు కల్పించే ముసాయిదా బిల్లును ప్రస్తుతానికి కర్ణాటక సర్కారు నిలుపుదల చేసింది. దానిపై త్వరలో సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య చెబుతున్నారు.

Tags:    

Similar News