భారత కేబినెట్ కార్యదర్శిగా టీవీ సోమనాథన్ నియామకం

భారత కేబినెట్ కార్యదర్శిగా టీవీ సోమనాథన్‌ను ప్రభుత్వం నియమించింది.

Update: 2024-08-10 13:15 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత కేబినెట్ కార్యదర్శిగా టీవీ సోమనాథన్‌ను ప్రభుత్వం నియమించింది. మొన్నటి వరకు రాజీవ్ గౌబా కేబినెట్ కార్యదర్శిగా కొనసాగగా ఆయన స్థానంలో సోమనాథన్ ను కేంద్రం నియమించింది. దీనిపై శనివారం సాయంత్రం కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలుపడంతో డీవోపీటీ ఉత్తర్వులను జారీ చేసింది. కాగా టీవీ సోమనాథన్ తమిళనాడు క్యాడర్, 1987 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధకారి. ఆయన ప్రస్తుతం భారత ఆర్థిక కార్యదర్శిగా ఉన్నారు. కాగా తాజా ఉత్తర్వులతో టీవీ సోమనాథన్ భారత కేబినెట్ కార్యదర్శిగా ఆగస్టు 30 నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

Tags:    

Similar News